Telangaana

Tuesday, January 18, 2011

ఆన్ లైన్ లో శ్రీకృష్ణ కమిటి తెలుగు నివేదిక

ప్రజల సౌకర్యం కొరకు శ్రీకృష్ణ కమిటి తెలుగు నివేదికలు ఆన్ లైన్ లో ఉంచినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలొ తెలిపింది.ఈ నివేదికలు www.ap.gov.in, www.aponline.gov.in వెబ్ సైట్లలో లబిస్తున్నట్లు తెలిపారు.

నివేదికల డైరెక్టు లింకులు.
http://www.ziddu.com/download/13454886/chapter_1.pdf.html
http://www.ziddu.com/download/13454888/chapter_2.pdf.html
http://www.ziddu.com/download/13454887/chapter_3.pdf.html
http://www.ziddu.com/download/13454882/chapter_4.pdf.html
http://www.ziddu.com/download/13454881/chapter_5.pdf.html
http://www.ziddu.com/download/13454885/chapter_6.pdf.html
http://www.ziddu.com/download/13454883/chapter_7.pdf.html
http://www.ziddu.com/download/13454889/chapter_8.pdf.html
http://www.ziddu.com/download/13454880/chapter_9.pdf.html
http://www.ziddu.com/download/13454884/FinalSKCTelugu.pdf.html

Saturday, January 15, 2011

విశాలాంధ్ర ఏర్పాటు నెహ్రూకు ఇష్టమేనా?

విశాలాంధ్ర ఏర్పాటుకు నెహ్రుకు మొదటి నుంచి ఇష్టం లేదు.ఆనాటి (16-10-1953)కర్నూల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్య వాద విస్తరణ కాంక్ష దాగుందని అన్నారు(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 17-10-1953). కానీ పరిపాలన సులవవుతుందన్న ఉద్దేశంతో దానికి ఆయన అంగీకరించాడు. అయితే.. విశాలాంధ్ర ఏర్పాటును మాత్రం చివరి వరకూ ఆయన వ్యతిరేకించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కొన్ని నెలల ముందు అంటే.. 5-03-1956న నిజామాబాద్‌లో జరిగిన సభలో నెహ్రూ పాల్గొన్నారు. ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొంతన కుదిరితే సరేసరి లేక పొతే కొంత కాలం తరువాత బార్య,భర్తలు విడాకులు తీసున్నట్లు రెండుప్రాంతాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చని ఆయన స్పష్టంగా చెప్పారు(డెక్కన్ క్రానికల్ 06-03-1956) దీన్ని బట్టి విశాలాంధ్ర ఏర్పాటు ఎన్ని అపనమ్మకాల పునాదుల మీద ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

"విశాలాంధ్ర ఏర్పాటుపై జవహర్ లాల్ నెహ్రు మనోగతం ఆయన మాటల్లోనే" క్రింది వీడియోలో చూడండి.

Thursday, January 13, 2011

ఇది తెలంగాణపై శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ తీరు




ఈ చిత్రం చిత్రకారుడు మితృలు అన్నవరం శ్రీనివాస్ కుంచె నుంచి జాలువారింది

అన్నవరం శ్రీనివాస్ వ్యాఖ్య: ఈ చిత్రం శ్రీ కృష్ణ కమిటి 6 సూచనల ఫై వేసింది .మొదటి 4 ఎలా వచ్చాయో ,5 వది బొటన వేలుకున్న పవర్ ,6 వది పనికి రానిది .

Sunday, January 9, 2011

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదా?

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన తరువాత తెలంగాణాలో ఊపందుకుంటున్న ఆందోళనలు సీమాంధ్రకు విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేయలేని దశకు చేరుకుంటే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చు.శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో కనిపిస్తున్న ఆందోళన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల్లో లేదు.తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే తప్ప నియోజక వర్గాలలో అడుగుపెట్టలేమని తెలంగాణ ప్రాంత ఎంపీల్లో అత్యధికులు హైకమాండ్‌కు స్పష్టం చేస్తూ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకపోతే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపితే అటూ సీమాంధ్రల్లో సైతం ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది.ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలూ రాజీనామా బాట పడితే ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా చూడడానికి మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మరోవిడత చర్చలు జరపాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.ఒక వేళ చర్చలు సఫలం కాక పోతే రాష్ట్రపతి పాలన తప్పక పోవచ్చనే వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి.శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలుపై అన్ని విషయాలను కూలంకశంగా చర్చించి చిట్టచివరి అస్త్రంగా రాష్ట్రపతి పాలనను ప్రవేశపెట్టే దిశలో కేంద్రం అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Thursday, January 6, 2011

బయట పడిన శ్రీకృష్ణ లీలలు

శ్రీ కృష్ణ కమిటి మొత్తం 6 సూచనలను తన నివేదికలో పొందుపరిచింది అవి .

1. రాష్ట్రాన్ని యథాతథ స్థితి కొనసాగించటం

2. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, - హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా చేయటం
రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు

3. రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర విభజించటం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణ భాగంలోనే ఉంచటం.

4. రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించటం, హైదరాబాద్ విస్తృత మెట్రో నగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయటం. కోసాంధ్ర, రాయలసీమకు హైదరాబాద్‌తో భౌగోళిక సంబంధం కొనసాగించటం.

5 రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల పరిధి ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా చేయటం, సీమాంధ్రకు కొత్త రాజధాని.

6 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయటం

Wednesday, January 5, 2011

ముల్కీ ఉద్యమం

1948 నుండి నాలుగేండ్లపాటు మిలిటరి, సివిల్ అధికారుల పాలలను అసరా చేసుకున్న అప్పటి మధ్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రులు చాల మంది వచ్చి ఇక్కడి ఉద్యోగాలను దక్కించుకున్నారు. తెలంగాణ వారికి ఇంగ్లీష్ రాదన్న ఒకే ఒక్క సాకుతో అధికారులు, పాలకులు ఆంధ్రులను కీలకమైన ఉద్యోగాలతో పాటు పలుఉద్యోగాలలో నింపారు. దీంతో ఆంధ్రులకు మంచి అవకాశం దొరికి నట్లైంది. అలా ఉద్యోగాల్లో చేరిన ఆంధ్రులు అనతి కాలంలోనే తమవారిని మరిన్ని ఉద్యోగాలలో నియమించారు. అలా స్థిరపడ్డ అంధ్రులు తెలంగాణ ప్రజలపై అధికార దర్పాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. ముల్కీ నిబందనలు అమలులో ఉన్నప్పటికి దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడాన్ని ఇక్కడి ప్రజలు తొందరగానే గుర్తించారు. అప్పుడే "గైర్ ముల్కీ గోబ్యాక్" "గోంగూర పచ్చడి గోబ్యాక్" "ఇడ్లి సాంబార్ గోబ్యాక్" అంటూ ఉద్యమం మొదలైంది.

విశాలాంధ్ర ఏర్పాటుకు కదిలిన పావులు

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి అప్పటిదాకా పోరాడిన వారంతా.. ఆపై తమ ఉద్యమాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. రెండు రాష్ట్రాలను విలీనం చేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రాంతంలో ఉద్యమం ఊపందుకొంది. కాంగ్రెస్ నేతలతో పాటు.. కమ్యూనిస్టు నేతలూ ఇందులో కీలకపాత్ర పోషించారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే.. విశాలాంధ్ర ఏర్పాటుకు పావులు కదిలాయి. అప్పటికే.. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు నేతలు.. విశాలాంధ్ర కోసం డిమాండ్ చేస్తుండడంతో.. ఆంధ్రాప్రాంతంలో.. పార్టీలకతీతంగా ఈ ఉద్యమం పాకిపోయింది. భాషా ప్రాతిపదికన ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపివేసి ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ఒత్తిడి పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర విభజన డిమాండ్లు వస్తుండడంతో.. ఫజల్ అలీ ఛైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ను 1953 డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. ఆంధ్రా, హైదరాబాద్‌కు చెందిన నేతలు ఎంతోమంది.. ఈ కమిషన్‌కు రెండు రాష్ట్రాల విలీనంపై ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. విస్తృత అధ్యయనం తర్వాత.. సెప్టెంబర్ 30, 1955న ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే.. విశాలాంధ్ర ఏర్పడితే.. ప్రయోజనాలున్నప్పటికీ.. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠా, కన్నడ మాట్లాడే ప్రాంతాలను విడదీసి.. తెలుగుమాట్లాడేవారికోసం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది. ఈ రిపోర్ట్‌పై.. తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. విశాలాంధ్రకు మద్దతు ఇస్తున్న హైదరాబాద్‌లోని కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు తమ పదవులు వదలుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే.. కమిషన్ తన రిపోర్ట్‌లోనే మరో విషయాన్ని కూడా చెప్పింది. ఒకవేళ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని భావిస్తే మాత్రం.. ఇప్పటికిప్పుడే ఆ ప్రయత్నం చేయకూడదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్రా ప్రజల్లో విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. ఈ విషయంలో అనిశ్చితి నెలకొందని ఫజల్ అలీ గుర్తించారు. ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. అందుకే.. 1961లో జరిగే ఎన్నికల తర్వాత.. హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని... మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తేనే.. రాష్ట్రాల విలీనానికి అంగీకరించాలని స్పష్టంగా చెప్పింది.. ఎస్సార్సీ.
ఎస్సార్సీ రిపోర్ట్ ప్రకారం వెళ్లాలంటే.. 1961 తర్వాత గానీ.. రాష్ట్ర విలీనం సాధ్యం కాదు. కానీ.. అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఆంధ్రరాష్ట్రానికి ఇది చాలా ఇబ్బందిగా మారింది. అప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్‌ను ఎప్పుడెప్పుడు కలుపుకుందామా అన్న ఆతృతతో అక్కడి నేతలున్నారు. మరో ఐదేళ్లు ఆగితే.. ఇక రాష్ట్ర విలీనం కాదన్న అంచనాతో.. ఆంధ్రా కాంగ్రెస్ నేతలు విశాలాంధ్రకోసం ఉద్యమాన్ని తీవ్రం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడంతో.. వెంటనే విలీనం జరగాలంటూ.. పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. విశాలాంధ్ర ఏర్పాటుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా.. సముఖంగా ఉండడంతో.. రెండు ప్రాంతాల మధ్య విభేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో ఎస్సార్సీ రిపోర్ట్‌కు భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మార్గం సుగమమయ్యింది.