Telangaana

Wednesday, January 5, 2011

ముల్కీ ఉద్యమం

1948 నుండి నాలుగేండ్లపాటు మిలిటరి, సివిల్ అధికారుల పాలలను అసరా చేసుకున్న అప్పటి మధ్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రులు చాల మంది వచ్చి ఇక్కడి ఉద్యోగాలను దక్కించుకున్నారు. తెలంగాణ వారికి ఇంగ్లీష్ రాదన్న ఒకే ఒక్క సాకుతో అధికారులు, పాలకులు ఆంధ్రులను కీలకమైన ఉద్యోగాలతో పాటు పలుఉద్యోగాలలో నింపారు. దీంతో ఆంధ్రులకు మంచి అవకాశం దొరికి నట్లైంది. అలా ఉద్యోగాల్లో చేరిన ఆంధ్రులు అనతి కాలంలోనే తమవారిని మరిన్ని ఉద్యోగాలలో నియమించారు. అలా స్థిరపడ్డ అంధ్రులు తెలంగాణ ప్రజలపై అధికార దర్పాన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు. ముల్కీ నిబందనలు అమలులో ఉన్నప్పటికి దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడాన్ని ఇక్కడి ప్రజలు తొందరగానే గుర్తించారు. అప్పుడే "గైర్ ముల్కీ గోబ్యాక్" "గోంగూర పచ్చడి గోబ్యాక్" "ఇడ్లి సాంబార్ గోబ్యాక్" అంటూ ఉద్యమం మొదలైంది.

No comments:

Post a Comment